ఎంత వేడుకున్నా భార్య కాపురానికి రాలేదని..

ఎంత వేడుకున్నా భార్య కాపురానికి రాలేదని..
  • మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ తో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి జిల్లా: భార్యా పిల్లలందరం కలసి బతుకుదాం.. నీవు వెంటనే కాపురానికి రమ్మంటూ వేడుకున్నా.. భార్య అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో జరిగిందీ ఘటన.  భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై. పల్లే రవీందర్ రెడ్డి (32) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రవీందర్ రెడ్డి కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ క్యాటరింగ్ లో విధులు నిర్వహిస్తున్నాడు రవీందర్ రెడ్డి. ఇతని స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. ఉపాధి కోసం కామారెడ్డి జిల్లాకు వచ్చాడు.