వరంగల్ కాంగ్రెస్లో రచ్చకెక్కిన విబేధాలు.. ఎర్రబెల్లి స్వర్ణ భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు

వరంగల్ కాంగ్రెస్లో రచ్చకెక్కిన విబేధాలు.. ఎర్రబెల్లి స్వర్ణ భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు

కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ భర్త ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావుపై పర్వతగిరి పోలీస్​స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో వరద రాజేశ్వరరావుపై పోలీసులు కేసులు పెట్టారు. 

పెద్ద తండాలో ఆగస్టు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి స్వర్ణ, ఆమె భర్త వరద రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఏర్పాట్లు చేసి.. పక్క తండాలో మరో నాయకుడు దగ్గరకు శ్రీనివాస్ నాయక్ వెళ్లారు. అయితే.. జిల్లా అధ్యక్షురాలు పర్యటన కాదని వేరే చోటికి ఎలా వెళ్తారంటూ తనను దూషించారని శ్రీనివాస్ నాయక్ పర్వతగిరి పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.