ఒలింపిక్ పతక విజేతలకు ఘన స్వాగతం

ఒలింపిక్ పతక విజేతలకు ఘన స్వాగతం

ఒలింపిక్ పతక విజేతలు, ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్స్ ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్య స్వాగతం పలికారు. సిల్వర్ మెడలిస్ట్, రెజ్లర్ రవికుమార్ దహియా, బ్రాంజ్ మెడలిస్ట్ భజరంగ్ పూనియా, లవ్లీనా, పురుషుల హాకీ జట్టు, మహిళా హకీ టీమ్ కు ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్కమ్ లభించింది. క్రీడాకారులంతా అశోకా హోటల్ కు చేరుకున్నారు. అక్కడ వారికి కేంద్ర క్రీడా శాఖా ఆధ్వర్యంలో సన్మానం జరగనుంది.