రోహిణి కోర్టులో పేలుడు.. సిబ్బంది పరుగులు

రోహిణి కోర్టులో పేలుడు.. సిబ్బంది పరుగులు

దేశ రాజధానిలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. ఏం జరిగిందో తెలియక అంతా పరుగులు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ల్యాప్ టాప్ బ్యాటరీ పేలినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు. కోర్టులోని రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్ లో ఉంచిన ల్యాప్ టాప్ పేలిందని పోలీసులు వెల్లడించారు. ల్యాప్ టాప్ నేలపై పడి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ల్యాప్ బ్యాటరీలో టెక్నికల్ సమస్యల వల్లే ఈ పేలుడు సంభవించిందని తెలుస్తోంది. 

గతంలోనూ ఇదే కోర్టులో ఒకసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు జితేంద్రగోగి అనే గ్యాంగ్‌స్టర్‌ పై కాల్పులకు దిగారు. రూమ్‌ నంబర్‌ 207లో జరిగిన ఈ ఘటనలో జితేంద్రతోపాటు ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్థారించారు.