సూరారంలో విషాదం..మూడో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడు మృతి

 సూరారంలో విషాదం..మూడో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. సూరారం పోలిస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో తులసినాద్ (10)అనే బాలుడు  మూడవ అంతస్తులో ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు. సైడ్ వాల్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఆడుకుంటూ కింద పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.