గుర్రం తొక్కడంతో మూడేళ్ల బాలుడు మృతి

గుర్రం తొక్కడంతో మూడేళ్ల బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న గండిగూడ  పామ్ అరేబియనా రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. రెస్టారెంట్ లోని  గుర్రంతో  ఆడుకుంటూ ప్రమాదవశాత్తు క్రింద పడ్డాడు.  బెదిరిన ఆ గుర్రం బాలుడి పైనుండి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన బాలుణ్ని అతని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.

ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచేందుకు ఆ రెస్టారెంట్ యాజమాన్యం ప్రయత్నించింది. రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగానే తమ కూమారుడు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెస్టారెంట్ నిర్వహకునిపై 304 A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. మృతి చెందిన బాలుడు పాతబస్తీకి చెందిన బాకేర్ షరీఫ్ కుమారుడు హైదర్ షరీఫ్ గా గుర్తించారు.