ఈ నెలాఖరులో రిటైర్మెంట్​.. ఇంతలోనే యాక్సిడెంట్

ఈ నెలాఖరులో రిటైర్మెంట్​.. ఇంతలోనే యాక్సిడెంట్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. మరో 15 రోజుల్లో రిటైర్ కావాల్సిన ఎస్సై.. డ్యూటీలో ఉండగా కారు ఢీకొని చనిపోయారు. లాతూర్ సింగ్(59) ఢిల్లీలోని చాందిని మహల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు. శుక్రవారం ఆయన రింగ్ రోడ్డుపై రాజ్ ఘాట్, శాంతివన్ సిగ్నల్స్ దగ్గర డ్యూటీ చేస్తున్నారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆ రూట్ లో స్పీడ్ గా వచ్చిన కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. లాతూర్ సింగ్ స్పాట్ లోనే చనిపోయారు. నిందితుడిని హర్యానాలోని సోనిపట్ జిల్లాకు చెందిన శోకేంద్ర(34)గా గుర్తించామని డీసీపీ శ్వేతా చౌహాన్ శనివారం తెలిపారు. శోకేంద్రను అరెస్టు చేశామని, అతని కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శోకేంద్ర ఢిల్లీలోని ఓ బ్యాంకులో పని చేస్తున్నారని పేర్కొన్నారు. లాతూర్ సింగ్ ఈ నెల 31న రిటైర్ కావాల్సి ఉందని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు భార్య, కొడుకు, బిడ్డ ఉన్నారని తెలిపారు.