డీఎస్పీ ఆఫీసులో పురుగుల మందు తాగిన మహిళా రైతు

డీఎస్పీ ఆఫీసులో పురుగుల మందు తాగిన మహిళా రైతు

నల్గొండ డీఎస్పీ ఆఫీసులో ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్ గూడ‌కు చెందిన కవిత అనే మహిళా రైతుకు.. తన భూమి విషయంలో గత మూడు నెలల నుంచి కొంతమందితో గొడవ జరుగుతోంది. పక్క భూమి వ్యక్తులు భూమిని అమ్ముకొని.. తన భూమి మీదకు వచ్చి గొడవచేస్తున్నారని కవిత ఆర్డీవో, ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఆర్డీవో భూమి సర్వేకు దరఖాస్తు చేసుకోమని చెప్పారు. అందులో భాగంగా సర్వే చేస్తున్న సమయంలో.. పోలీసులు కవితకు చెందిన భూమి వేరేవాళ్లదని.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కవితను పంపించారు. దాంతో పోలీసుల చర్యతో మనస్థాపానికి గురైన కవిత.. డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు.. కవితను చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.