జీడిమెట్లలో బాలుడి కిడ్నాప్..గంటన్నరలోపే చేధించిన పోలీసులు

జీడిమెట్లలో బాలుడి కిడ్నాప్..గంటన్నరలోపే చేధించిన పోలీసులు
మేడ్చల్  జీడీమెట్ల పీఎస్ పరిదిలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసింది ఓ మహిళ . సంజయ్ గాంధీ నగర్ కు చెందిన శ్రీకాంత్ కుమారుడు రాధాకృష్ణ (13నెలలు) అనే బాలుడిని కిడ్నాప్ చేసింది పద్మ అనే మహిళ. చిన్నారి తండ్రి శ్రీకాంత్ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఐదు  పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఫిర్యాదు చేసిన గంటన్నరలోపే షాపూర్ నగర్ లోని ఓ గల్లిలో పోలీసులకు పట్టుబడింది మహిళ.  ఆమె నుంచి బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఆ మహిళ బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు జీడిమెట్ల పోలీసులు. మాపై దాడులు చేస్తే.. నెక్స్ట్ దాడి ప్రగతిభవన్ లోనే..