ఇంటర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో​ ఆత్మహత్య

ఇంటర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో​ ఆత్మహత్య

పాలకుర్తి, వెలుగు : ఇంటర్​ లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఈరెంటి వంశీ ( 20 ) గత ఏడాది ఇంటర్​ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్​ తప్పాడు. గత నెలలో పరీక్షలు నిర్వహించగా రాశాడు. కొద్ది రోజుల్లో ఫలితాలు రాబోతుండగా మళ్లీ ఫెయిల్​అవుతానేమోనని భయపడుతున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు టెర్రస్​పై పడుకోగా వంశీ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. గురువారం ఉదయం వంశీ తల్లి రాజేశ్వరి కిందకు వచ్చి డోర్​కొట్టగా ఎంతకీ తీయలేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా వంశీ ఉరి వేసుకొని కనిపించాడు. తర్వాత తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణం పోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి ప్రసన్న కుమార్​ తెలిపారు.