లాక్డౌన్, రైతుబంధు మొదలైన సమస్యలపై కాసేపట్లో కేబినెట్ భేటీ జరుగనుంది. అందుకోసం మంత్రులంతా ప్రగతిభవన్కు వస్తున్న సమయంలో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో క్యాంపు ఆఫీసు ముందు అలజడి నెలకొంది. తన ఇంటి విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని నర్సింగరావు అనే యువకుడు పెట్రోల్ పోసుకున్నాడు. ఇల్లు కబ్జా చేశారని సీఐ మహేష్ వద్దకు వెళ్తే.. రౌడీషీటర్తో సెటిల్మెంట్ చేసుకోమన్నారని ఆవేదన చెందాడు. అప్రమత్తమైన పోలీసులు.. యువకుడిని పట్టుకొని నీళ్లు పోసి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.