ఉద్యోగం వచ్చిన గంటల్లోనే… రైలు నుంచి కింద పడి యువతి మృతి

ఉద్యోగం వచ్చిన గంటల్లోనే… రైలు నుంచి కింద పడి యువతి మృతి

చెన్నైలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి అదుపు తప్పి కింద పడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఉద్యోగం వచ్చిందని ఆనందించేలోపే  రైలు నుంచి కిందపడి చనిపోయింది. కుటుంబానికి కన్నీరును మిగిల్చింది.

అసలేం జరిగిందంటే  చెన్నైలోని తిరునెల్లేల్లి జిల్లా శంకరన్ కోవిల్ కు చెందిన గురునాథన్ కుతురు మనీషా శ్రీ గ్రూప్ 4 లో పాస్ అయ్యింది. మంగళవారం మనీషా ఆమె తండ్రి, సోదరి భర్తతో కలిసి కౌన్సిలింగ్ కోసం చెన్నై వెళ్లింది. గ్రామీణ వైద్య విభాగంలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం చెన్నై- సెంగోట్టై స్పెషల్ ట్రైన్ లో రిటన్ అయ్యారు. బుధవారం తెల్లవారుజామున విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు  కొప్పైనాయక్కర్ పట్టి దగ్గరకు రాగానే గాలి కోసం రైలు ఎక్కే మెట్ల దగ్గరకు వచ్చింది మనీషా. ఇంతలోనే ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. ఆ సమయంలో ఆమె తండ్రి,సోదరి భర్త  నిద్రిపోతున్నారు.  శంకరన్ కోవిల్ దగ్గరకు రాగానే నిద్రలేచిన ఆమె తండ్రి కూడా మనీషా కోసం వెతికారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో శ్రీవిల్లిపుత్తూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రైలు పట్టాలపై వెతకడంతో మనీషా మృతదేహం కొప్పైనాయక్కర్ పట్టర్ లో  దొరికింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్లు కన్నీరుమున్నీరయ్యారు.