బైక్ పై నుంచి క్రేన్ కింద‌ప‌డి యువ‌తి మృతి

బైక్ పై నుంచి క్రేన్ కింద‌ప‌డి యువ‌తి మృతి

సికింద్రాబాద్: చిలుక‌ల‌గూడ పి ఎస్ ప‌రిధిలోని ఒలిఫెంటా బ్రిడ్జి ద‌గ్గ‌ర జ‌రిగిన‌‌ రోడ్డు ప్రమాదంలో ఓ యువ‌తి చ‌నిపోయింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగింది. బైక్ అదుపు త‌ప్పి ట్రాఫిక్ క్రేన్ కింద‌ప‌డ‌టంతో యువ‌తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. అయితే యువ‌తిని బైక్ పై ఎక్కించుకుని వ‌చ్చిన యువ‌కుడు.. యువ‌తి ద‌గ్గ‌ర‌కు రాకుండా బైక్ తో ప‌రారీ అయ్యాడ‌ని తెలిపారు స్థానికులు. స‌మాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించిన‌ట్లు తెలిపారు పోలీసులు. యువ‌తి ఐడీ కార్డు ఆధారంగా ఆమె పేరు సాయి ల‌క్ష్మి అని..‌ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో క్ల‌ర్క్ గా ప‌ని చేస్తున్న‌ట్లు గుర్తించిన పోలీసులు .. యువ‌తి చ‌నిపోయిన విష‌యాన్ని ఆమె ప‌ని చేస్తున్న ఆఫీసుకు ఫోన్ చేసి తెలిపారు. కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేశామ‌న్నారు చిలుక‌ల‌గూడ పోలీసులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..