
అశోక్ సెల్వన్ హీరోగా ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో ‘ఆకాశం’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారి లుక్స్ని నిన్న రివీల్ చేశారు. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షిగా శివాత్మిక రాజశేఖర్, రైతు కూతురు మతిగా ట్రాక్టర్ నడుపుతూ అపర్ణ బాలమురళి.. ట్రావెలింగ్ని ఇష్టపడే మోడర్న్ అమ్మాయి శుభగా రీతూవర్మ కనిపిస్తున్నారు.మత్తువదలరా, తెల్లవారితే గురువారం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న కీరవాణి కొడుకు శ్రీ సింహా.. ఈసారి ‘దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ వస్తున్నాడు. సతీష్ త్రిపుర దర్శకుడు. ప్రీతి అస్రాని హీరోయిన్. సురేష్ బాబు, సునీత తాటి నిర్మించారు.
సెప్టెంబర్ 23న సినిమా రిలీజవుతున్న సందర్భంగా నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సింహా మాట్లాడుతూ ‘కెరీర్ స్టార్టింగ్లోనే ఇలాంటి సబ్జెక్ట్ రావడం లక్కీ. తెలుగులో ఈ జానర్ సినిమా ఎవరూ చేయలేదు’ అన్నాడు. ‘నాకిది స్పెషల్ ఫిల్మ్. ఇలాంటి స్ర్కిప్ట్ నేనెప్పుడూ వినలేదు. ప్రేక్షకులు కూడా ఎప్పుడూ చూసి ఉండరు. నీరజ అనే స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపిస్తాను. మహిళలంతా నా పాత్రకి కనెక్టవుతారు’ అంది ప్రీతి. సతీష్ మాట్లాడుతూ ‘రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో చదువుకుని ఇదే బ్యానర్లో దర్శకుడిగా పరిచయమవడం హ్యాపీ. సురేష్ బాబు చాలా సపోర్ట్ చేశారు. సునీత బ్యాక్బోన్గా నిలిచారు. తెలుగులో ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. సింగిల్ లొకేషన్లో షూట్ పూర్తి చేశాం’ అన్నాడు. అందరికీ కొత్త అనుభూతినిచ్చే అద్భుతమైన సినిమా అన్నారు సునీత.