ఇద్దరు ఆప్ మంత్రులు రాజీనామా..కేజ్రీవాల్ ఆమోదం

ఇద్దరు ఆప్ మంత్రులు రాజీనామా..కేజ్రీవాల్ ఆమోదం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ సైతం పదవిని వదులుకున్నారు. వారిద్దరి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ గత 9 నెలలుగా జైలులోనే ఉన్నారు. ఆరోపణలు  ఎదుర్కొంటున్న వ్యక్తులు కేజ్రీవాల్ కేబినెట్లో ఎందుకున్నారంటూ బీజేపీ విమర్శల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం విశేషం. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఢిల్లీ కేబినెట్ పునర్వ్యవస్థీకరించే అవకాశముంది.