
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగాసారె తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆషాఢ మాసం మొదటి రోజైన ఇవాళ(బుధవారం) ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఇవాళ్టి నుంచి నుంచి ఆగస్ట్ 1 వరకు వేల సంఖ్యలో మహిళలు అమ్మవారికి సారె సమర్పించనున్నారు. ఆషాఢమాసం, శ్రావణమాసం ఆ తర్వాత దసరా నవరాత్రుల సందర్భంగా వరుసగా 90 రోజుల పాటు అమ్మవారి దేవస్థానం కిటకిటలాడనుంది.