Delhi liquor scam : అభిషేక్ బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు

Delhi liquor scam : అభిషేక్ బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ దాఖలు చేసిన కేసుకు సంబంధఇంచి బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అభిషేక్ను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. శనివారంతో అతని రిమాండ్ గడువు ముగియడంతో సీబీఐ స్పెషల్ కోర్టు దాన్ని మరో 21 రోజులు పొడిగించింది. నిజానికి సీబీఐ కేసులో అభిషేక్ కు గతంలోనే బెయిల్ వచ్చింది. అయితే ఈడీ కేసులో రాకపోవడంతో ప్రస్తుతం అతను తీహార్ జైలులోనే ఉన్నాడు. 

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్షీట్ను విచారణకు స్వీకరించడంపై 28న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది. శుక్రవారం దాఖలు చేసిన 13,567 పేజీల ఈ చార్జ్ షీట్​లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు మోపినట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ వివరించారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.