రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్కూల్స్ బంద్

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్కూల్స్ బంద్

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కొనసాగుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడి నియంత్రించడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని స్కూళ్ల వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ డీఈవో ఆఫీసు ముట్టడి

హైదరాబాద్ డీఈవో ఆఫీసును ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు ముట్టడించాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడి నియంత్రించడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలని అన్నారు. ఇక నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ బంద్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ బంద్ కొనసాగుతోంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలటూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. దీంతో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ బంద్ కొనసాగుతోంది. స్కూల్స్ రీ ఓపెన్ అయ్యి 20 రోజులవుతున్నా పుస్తకాలు పంపిణీ చేయలేదంటూ ఫైర్ అయ్యారు ABVP నేతలు. స్కూల్స్ లో కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. వెంటనే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులను నియంత్రించాలన్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా స్కూల్ బంద్

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా స్కూల్ బంద్ కొనసాగుతోంది. పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ స్కూల్స్ మూతపడ్డాయి. ప్రైవేటు స్కూల్స్ లో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏబీవీపీ కార్యకర్తలు. ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే బుక్స్ పంపిణీ చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

జగిత్యాల జిల్లాలో పాఠశాలలు బంద్

స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా  పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. దీంతో జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇవాళ స్కూల్స్ మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్, యూనిఫాంలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూల్స్ లో ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు ఏబీవీపీ నేతలు.