గొర్రెల స్కామ్ లో మరో అధికారి

గొర్రెల స్కామ్ లో మరో అధికారి

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. దీంతో ఈ కేసులో ఒక్కొక్కటిగా అవినీతి చిట్టా బయటకొస్తోంది. గొర్రెల స్కామ్ లో తాజాగా మరో అధికారి పాత్ర బయటపడింది. పశు సంవర్ధక శాఖ ఏడిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గొర్రెలను పంపిణీ చేశాక తమకు నిధులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపించారు రైతులు. డబ్బులు చెల్లించినా తమ ఖాతాకు నిధులు పంపలేదని ఫిర్యాదు చేశారు. 

నెల్లూర్ జిల్లా రైతుల నుండి గొర్రెలను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిరిగి లంచం డిమాండ్ చేసినట్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఏడి పాత్రపై విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గొర్రెల స్కామ్ లో ఏడుగురిపై కేసు నమోదు చేసిన ACB అధికారులు.. నలుగురిని అరెస్ట్ చేశారు.