
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ స్పీడ్ పెంచింది. 9 నెలల పాటు ఈ కేసును విచారించిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కేసులో కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఎఫ్ఈఓ లను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది.. గవర్నర్ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేసులో నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్ ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని.. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ తెలిపింది.
►ALSO READ | స్టూడెంట్స్ కు జర్మనీ, జపాన్ లాంగ్వేజ్ స్కిల్స్ : మంత్రి వివేక్ వెంకటస్వామి
ఈ కేసులో కేటీఆర్ ను రెండు సార్లు, ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను మూడు సార్లు ఏసీబీ విచారించింది. కేటీఆర్, అర్వింద్ కుమార్ స్టేట్ మెంట్లను రికార్డ్ చేసిన ఏసీబీ..ఈ కేసులో క్విడ్ ప్రోక్ జరిగినట్లు తేల్చింది. ఈ కార్ రేసింగ్ కు స్పాన్సర్ షిప్ చేసిన సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని ఈ విధంగా క్విడ్ ప్రోకో జరిగినట్టు నిర్ధారించింది ఏసీబీ