హత్య కేసులో నిందితులు అరెస్టు

హత్య కేసులో నిందితులు అరెస్టు
  •     న్యూ ఇయర్ రోజు గొడవలో వ్యక్తికి తీవ్ర గాయాలు
  •      చికిత్స పొందుతూ మృతి 
  •     హైదరాబాద్​లో ఘటన  

జూబ్లీహిల్స్,వెలుగు : న్యూ ఇయర్ రోజు మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా నిందితులను బంజారాహిల్స్​పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 14 లోని రాఘవేంద్ర కన్​స్ట్రక్షన్ లో బిహార్​కు చెందిన పంకజ్ ​కుమార్, రాజేశ్ కూలీలుగా, ఆనంద్​కుమార్, సంజిత్ తివారీ సెక్యూరిటీ గార్డులుగా చేస్తున్నారు. 

ఈనెల 1న పంకజ్ ​కుమార్, రాజేశ్ మరికొందరితో సైటులోని రూమ్​ లో మద్యం తాగుతున్నారు. మత్తులో నలుగురి మధ్య  గొడవ జరిగింది. దీంతో పంకజ్​ కుమార్, రాజేశ్​పై ఆనంద్​కుమార్, ​సంజిత్ ​తివారీ పిడిగుద్దులు కురిపించారు.  భయంతో పరుగు తీసిన వారు ఎదురుతిరిగి రాయి విసిరారు. రాయి నుంచి తప్పించుకున్న ఆనంద్ ​కుమార్​, సంజిత్ ​తివారీ వారిని కట్టెలతో తీవ్రంగా కొట్టారు. గాయపడిన పంకజ్​కుమార్​ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో  చేర్పించారు. చికిత్స పొందుతూ బాధితుడు  ఈనెల 2న చనిపోయాడు. నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.