- న్యూ ఇయర్ రోజు గొడవలో వ్యక్తికి తీవ్ర గాయాలు
- చికిత్స పొందుతూ మృతి
- హైదరాబాద్లో ఘటన
జూబ్లీహిల్స్,వెలుగు : న్యూ ఇయర్ రోజు మద్యం మత్తులో జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందగా నిందితులను బంజారాహిల్స్పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 14 లోని రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ లో బిహార్కు చెందిన పంకజ్ కుమార్, రాజేశ్ కూలీలుగా, ఆనంద్కుమార్, సంజిత్ తివారీ సెక్యూరిటీ గార్డులుగా చేస్తున్నారు.
ఈనెల 1న పంకజ్ కుమార్, రాజేశ్ మరికొందరితో సైటులోని రూమ్ లో మద్యం తాగుతున్నారు. మత్తులో నలుగురి మధ్య గొడవ జరిగింది. దీంతో పంకజ్ కుమార్, రాజేశ్పై ఆనంద్కుమార్, సంజిత్ తివారీ పిడిగుద్దులు కురిపించారు. భయంతో పరుగు తీసిన వారు ఎదురుతిరిగి రాయి విసిరారు. రాయి నుంచి తప్పించుకున్న ఆనంద్ కుమార్, సంజిత్ తివారీ వారిని కట్టెలతో తీవ్రంగా కొట్టారు. గాయపడిన పంకజ్కుమార్ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాధితుడు ఈనెల 2న చనిపోయాడు. నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.