
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, హీరో కృష్ణంరాజు అస్వస్థకు గురయ్యారు. గత నాలుగు రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో భాదపడుతున్నట్లు సమాచారం. జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో ఆయన చికిత్స నిమిత్తం బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కృష్ణంరాజు న్యూమోనియాతో భాదపడుతున్నట్లు కూడా తెలుస్తోంది.