చంద్రబాబు మోసం చేశాడు : మోహన్ బాబు

చంద్రబాబు మోసం చేశాడు : మోహన్ బాబు

చిత్తూరు : నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు నమ్మించి మోసం చేశాడన్నారు నటుడు మోహన్ బాబు. తమ విద్యాసంస్థలకు రూ. 19 కోట్ల ఫీజు రియింబర్స్‌ మెంట్ ఇవ్వాలన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆఖరికి చంద్రబాబుకు స్వయంగా తానే ఉత్తరాలు రాసినా ఫలితం లేదని సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలు చేయకుండా, కొత్త పథకాలతో చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపానే. చంద్రబాబు ఒక అబద్దాల కోరు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన నిరసన ఆగదని, తన విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న బిడ్డల కోసమే ఈ ఉద్యమం అని చెప్పారు మోహన్‌ బాబు.