ముంబై: సీనియర్ బాలీవుడు నటుడు రాజీవ్ కపూర్ (58) కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజీవ్ కపూర్ కుటుంబసభ్యురాలు నీతూ కపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు నీతూ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో రాజీవ్ కపూర్ ఫొటోను షేర్ చేశారు. దానికింద రిప్ అని కామెంట్ పెట్టారు. రాజీవ్ కపూర్ తన కెరీలో రామ్ తేరీ గంగా మైలీ, మేరా సాథీ, హమ్ తో చలే పర్దేశీ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1991లో హెన్నా అనే సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారారు.
అంతేకాదు, రాజీవ్ కపూర్ కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఆ తర్వాత 28 ఏండ్లు సినిమా రంగానికి దూరంగా ఉన్న రాజీవ్ కపూర్ ఇటీవల సెట్స్ మీదికి వచ్చిన అశుతోష్ గొవారికర్ సినిమా తులసీదాస్ జూనియర్ ద్వారా సినీ ఫీల్డ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజీవ్ కపూర్ మరణానికిగల కారణాల తెలియరాలేదు. దివంగత రిషి కపూర్, రణదీర్ కపూర్లు రాజీవ్ కపూర్ సోదరులు.
https://www.instagram.com/p/CLEE5tJgt25/?utm_source=ig_web_copy_link