పిల్లికి బిచ్చం పెట్టని నాగబాబుకి ఓటు వెయ్యొద్దు: శివాజీ రాజా

పిల్లికి బిచ్చం పెట్టని నాగబాబుకి ఓటు వెయ్యొద్దు: శివాజీ రాజా

నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. 600 మందికి పైగా సభ్యులున్న ‘మా‘ కే న్యాయం చేయలేని వాడు నర్సాపురం ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీడియా సమవేశంలో మాట్లాడిన శివాజీ రాజా.. ‘ నాగబాబు ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా కనీసం దాని బోర్డర్స్ తెలుసా. ఏనాడైనా అక్కడి ప్రజలకు ఏదైనా చేసారా. పిల్లికి బిచ్చం కూడా పెట్టని నువ్వు ఏ విధంగా అక్కడ కు వెళ్లి ప్రజల్ని ఓట్ వేయమని అడుగుతున్నావ్. నీ ప్రసంఘాలన్నీ వింటున్నాం కులాలను రెచ్చగొట్టేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే కానీ కులాలను రెచ్చగొట్టొద్దు‘ అని అన్నారు .

‘పరిశ్రమలో చిరంజీవి తర్వాతే నాకు ఎవరైనా. పవన్ తన పదే తాను చేసుకుంటున్నాడు. కానీ వీరి ఇద్దరి మధ్య పుట్టిన నాగబాబుకే ఏ విజన్ లేదు.  ఏ రకంగాను ఆదర్శంగా తీసుకోడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అని గెలిపించావో వాళ్లే ఈ రోజు మీపై విమర్శలు చేశారు.  30 ఏళ్ళ నుంచి మెగాస్టార్ ని మిమ్మల్ని నమ్మిన మేము పరాయి వాళ్ళం అయిపోయామా‘  అని అన్నారు శివాజీ రాజా.

ఇటీవలే జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి  శివాజీరాజాని విమర్శించారు నాగబాబు. జీవిత రాజశేఖర్ లు ఉన్న నరేష్ ప్యానెల్ ను గెలిపించాలని కోరారు. దీనికి కౌంటర్ గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న శివాజీరాజా  నాగబాబుపై విమర్శలు చేశారు.