పెంపుడు జంతువుల‌పై వెంక‌టేష్ ట్వీట్

పెంపుడు జంతువుల‌పై వెంక‌టేష్ ట్వీట్

జంతువుల నుంచి క‌రోనా సోకుతుంద‌నే పుకార్ల‌ను కొట్టిపారేశాడు హీరో విక్ట‌రీ వెంక‌టేష్. జంతువుల నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందనే పుకార్లతో చాలా మంది తమ ఇంట్లో ఇప్పటి వరకు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న కుక్కలను వ‌దిలించుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే వీధిల్లోకి త‌రిమేస్తున్నారు కూడా. ఇలాంటి ఘ‌ట‌న‌లు వెంక‌టేష్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న అస‌హ‌నానికి లోన‌వుతూ ట్విట్ట‌ర్ లో స్పందించాడు.

ఈ క‌ష్ట‌కాలంలో పెంపుడు జంతువుల‌కు మ‌న అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఇది మనుషులకు మాత్రమే వచ్చిన కష్టం కాదు.. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఇది కష్ట సమయమే అన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే రూమ‌ర్స్ కారణంగా చాలా మంది తమ ఇంట్లో ఉన్న జంతువులను తరిమివేయడం దారుణమైన విష‌య‌మ‌న్నాడు. మనతో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదేన‌ని.. లాక్‌డౌన్ సమయంలో వాటితో కొంత సమయాన్ని కేటాయించండి అంటూ ట్వీట్ చేశాడు వెంకీ.