డ్రగ్స్ కేసులో ముగిసిన చార్మి విచారణ

డ్రగ్స్ కేసులో ముగిసిన చార్మి విచారణ

హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చార్మి విచారణ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట గురువారం విచారణకు హాజరైన చార్మిని సుమారు 8 గంటలకుపైగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుతోపాటు మనీ లాండరింగ్ కింద ఈడీ అధికారులు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. నిన్న తొలి రోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను విచారించిన ఈడీ అధికారులు ఇవాళ చార్మిని విచారించారు. 
హైదరాబాద్ ఈడీ ఆఫీసులో  విచారణ ముగించుకుని బయటకు వచ్చిన నటి చార్మి మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేనన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, లావాదేవీల వివరాలు అడిగితే డాక్యుమెంట్లు సమర్పించానని తెలిపారు. ఈడీ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం సరికాదని చెప్పారు.