రాడిసన్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరైన నటి లిషి

రాడిసన్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరైన నటి లిషి

రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా నటి లిషి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరైంది. ఆమె నుంచి పోలీసులు శాంపిల్స్ సేకరించి డ్రగ్ పరీక్షల నిమిత్తం లాబ్ కు  పంపించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందన్న సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద్‌తో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు.  విచారణకు హాజరుకావాలని వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ లిషి గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు  హాజరైంది.  మరోవైపు ఇదే కేసులో అనుమానితులుగా ఉన్న సందీప్,  శ్వేత, నీల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు కాగానే రాత్రికి రాత్రే నీల్ అమెరికాకు వెళ్లిపోయాడు.  నటుడు నీల్ పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు గచ్చిబౌలి పోలీసులు.

ALSO Read : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..