శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

విదేశాల నుంచి బంగారం తరలించే వారిపై కస్టమ్స్ అధికారులు కొరడా ఝులుపుతున్న బంగారాన్ని తరలించడం మాత్రం ఆపడం లేదు కేటుగాళ్లు. దేశ వ్యాప్తంగా రోజుకో చోట అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుపడింది. 

కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను అనుమానంతో తనిఖీ చేయగా.. కొందరి వద్ద భారీ మొత్తంలో   బంగారాన్ని గుర్తించారు. 13.65 కిలోల అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం విలువ రూ. 6.03 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.