ఇండిగో సిబ్బంది పై పూజా ఫైర్

ఇండిగో సిబ్బంది పై పూజా ఫైర్

విపుల్ నకాషే అనే ఇండిగో సిబ్బంది పైన హీరోయిన్  పూజా హెగ్డే ఫైర్ అయింది. అతను ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ  ట్వీట్ చేసింది.  ముంబై నుంచి వస్తోన్న ఇండిగో విమానంలో విపుల్ నకాషే ఎటువంటి తప్పు లేకున్నా మాతో చాలా మొరటుగా ప్రవర్తించాడని పేర్కొంది. వాస్తావానికి ఇలాంటి సమస్యల గురించి తాను పట్టించుకోనని కానీ ఈ  సంఘటన తనని ఎంతో భయపెట్టిందని పూజా తన ట్వీట్ లో తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారడంతో ఇండిగో సంస్థ స్పందించింది.

పూజా హెగ్డేకి క్షమాపణలు చెప్తూ మీ ప్రాబ్లమ్ ని, మీరు ప్రయాణించిన టికెట్ PNR నంబర్ ని మాకు మెసేజ్ చేయండి. మేము త్వరగా మీ సమస్యని పరిష్కరిస్తామని పోస్ట్ చేసింది.  కాగా ఇటీవల ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ చిత్రాలతో ఆలరించిన ఈ బుట్టబోమ్మ  ప్రస్తుతం మహేష్, విజయ్ లతో సినిమాలు చేస్తోంది.