బిగ్ బాస్లో కూతురు కారణంగా తల్లిపై దాడి.. వనిత మొహంపై పిడిగుద్దులు

బిగ్ బాస్లో కూతురు కారణంగా తల్లిపై దాడి.. వనిత మొహంపై పిడిగుద్దులు

నటి వనిత విజయ్ కుమార్(Vanithan Vijaykumar) పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రెడ్ కార్డు గుర్తుందా అంటూ ఆమె మొహంపై పిడిగుద్దులు గుద్దారు. ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు వనిత విజయ్ కుమార్. ప్రస్తుతం ఆమె కూతురు జోవిక తమిళ బిగ్‌ బాస్‌-7  కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆమె వల్ల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కు సంబందించిన వ్యక్తులే ఈ దాడి చేశారని తెలుస్తోంది. 

ఇంతేకీ అసలు విషయం ఏంటంటే.. తమిళ బిగ్‌ బాస్‌-7లో వనిత కూతురు జోవిక కారణంగా ఆంటోనీ ప్రదీప్‌ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆంటోనీ ప్రదీప్‌ మద్దతుదారులు జోవిక తల్లి వనితపై దాడి చేసిన గాయపరిచారు. ఇక ఇదే విషయం గురించి వనిత మాట్లాడుతూ..     

నాపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు దారుణంగా దాడి చేశారు. ఆ వ్యక్తి బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ ఫ్యాన్ అని తెలుస్తోంది. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్‌ రివ్యూ చెప్పి డిన్నర్ కోసం బయటకు వచ్చాను. కారు తీయడానికి వస్తుండగా చీకట్లోంచి ఓ వ్యక్తి వచ్చి.. రెడ్ కార్డ్ గుర్తుందా? అంటూ నా మొహంపై రక్తం వచ్చేలా పిడిగుద్దులు గుద్దాడు. దాంతో నేను అరుస్తూ ఏడ్చాను. అర్ధరాత్రి కావడంతో నా చుట్టూ ఎవరూ లేరు. అక్కకి చెప్తే.. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పింది. కానీ నేను చేయలేదు. కారణం నేను వాళ్ళని నమ్మలేను కానీ.. పోలీసుల వద్దకు తప్పకుండా వెళ్తాను.  ప్రస్తుతం నేను విశ్రాంతిలో ఉన్నాను.. ఈ స్థితిలో నేను మీడియా ముందుకు రాలేను.. అంటూ చెప్పుకొచ్చారు వనిత విజయ్ కుమార్.