![యూపీఐ బిజినెస్లోకి అదానీ గ్రూప్](https://static.v6velugu.com/uploads/2024/05/adani-group-plans-to-enter-india-digital-payment-e-commerce_2rKcMSu6il.jpg)
- లైసెన్స్ కోసం చూస్తోందన్న ఫైనాన్షియల్ టైమ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, ఆన్లైన్ పేమెంట్స్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని అదానీ గ్రూప్ చూస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. గూగుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్కు పోటీగా ఓ డిజిటల్ కంపెనీని అదానీ గ్రూప్ డెవలప్ చేస్తోందని తెలిపింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లైసెన్స్ కోసం అదానీ గ్రూప్ చూస్తోందని, కో–బ్రాండెడ్ అదానీ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చేందుకు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది.
ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ద్వారా ఆన్లైన్ షాపింగ్ సర్వీస్లను అందించేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఒకవేళ అనుమతులు వస్తే కంపెనీ కన్జూమర్ యాప్ అదానీ వన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ సర్వీస్లను అందించనుంది. హోటల్, ఫ్లయిట్ రిజర్వేషన్లు వంటి ట్రావెల్ రిలేటెడ్ సర్వీస్లను అదానీ వన్ అందిస్తోంది.
రూ.16,600 కోట్లు సేకరించనున్న అదానీ ఎంటర్ప్రైజెస్
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) రూట్లో రూ.16,600 కోట్లు సేకరించేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డ్ ఆమోదం తెలిపింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కు షేర్లను అమ్మడం ద్వారా ఈ ఫండ్స్ను సేకరించనుంది. ‘ఫేస్ వాల్యూ రూ.1 ఉన్న రూ.16,600 కోట్ల విలువైన షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ సేకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. క్యూఐపీ లేదా ఇతర మార్గాల్లో ఈ ఫండ్స్ను దశల వారీగా సేకరిస్తాం’ అని అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది.