టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్ తాజాగా ‘హిట్ 2’ తో మరో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. మేజర్ సినిమాకుగాను సంతోషం అవార్డు అందుకున్న ఈ హీరో తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన అడివి శేష్ చిరంజీవిని ఉద్దేశిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు.
తన చిన్నతనంలో మెగాస్టార్ సినిమా టికెట్ల కోసం కొట్టుకునే వాళ్లమని... ఆ రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చిరంజీవిని ఉద్దేశించి అడవిశేష్ పోస్టు పెట్టారు. ఇక ‘మేజర్’ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా చిరంజీవితో గడపడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఆయన చేతుల మీదగా మేజర్ సినిమాకు వచ్చిన అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. మాటల్లో చెప్పలేకపోతున్నాను అంటూ పోస్టులో రాశాడు. ఈ మూమెంట్ తనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. థ్యాంక్యూ చిరంజీవి సర్ అంటూ అడవి శేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అడివి శేష్ను ప్రశంసిస్తున్నారు. ఇక గతేడాది ‘మేజర్’ , ‘హిట్ 2’ రెండు సినిమాలతో బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. తన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన గూఢచారి సినిమా సీక్వెల్ను త్వరలోనే పట్టాలెక్కిస్తున్నట్లు తెలిపాడు.