చెన్నై యాక్టివిస్ట్​కు అమెరికా అవార్డు

చెన్నై యాక్టివిస్ట్​కు అమెరికా అవార్డు

చెన్నై: చెన్నైకి చెందిన అడ్వొకేట్, యాక్టివిస్ట్​ లలితా నటరాజన్‌‌‌‌ యూఎస్​2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారు. మే 30న చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్ నటరాజన్‌‌‌‌ ఈ అవార్డును అందజేశారు. 

బాల  కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.  లలితా నటరాజన్‌‌‌‌ తమిళనాడు ప్రభుత్వ ​సోషల్​ డిఫెన్స్​ డిపార్ట్​మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలిగా.. బాల కార్మిక చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం(పోక్సో) కింద బాధితులకు పరిహారం అందేలా చూస్తున్నారు.