ఆప్ఘన్ మిలటరీ బేస్ పై తాలిబాన్ల ఎటాక్ : 25 మంది సైనికులు మృతి

ఆప్ఘన్ మిలటరీ బేస్ పై తాలిబాన్ల ఎటాక్ : 25 మంది సైనికులు మృతి

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సౌత్ ఆఫ్ఘనిస్తాన్ .. హెల్మండ్ ప్రావిన్స్ లోని షోరాబ్ మిలటరీ బేస్ పై తాలిబాన్లు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది ఆప్ఘన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. ఆప్ఘన్ సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో 20మంది చొరబాటు దారులు హతమైనట్టు అధికారులు తెలిపారు.

ఆప్ఘనిస్థాన్ లో ఇది అతిపెద్ద మిలటరీ బేస్. 48 గంటలుగా ఈ బేస్ క్యాంప్ వద్ద చొరబాటు దారులు, ఆప్ఘన్ సైన్యం మధ్య కాల్పులు జరిగాయని… శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు క్యాంప్ పై మెరుపు దాడి చేయడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని డిఫెన్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి గఫూర్ అహ్మద్ చెప్పారు.

ఆప్ఘన్ సైన్యం బేస్ క్యాంప్ కు దగ్గర్లోని కాంప్లెక్స్ లలో యూఎస్, ఇతర అంతర్జాతీయ దేశాల సైనిక క్యాంప్ లు ఉన్నాయి. తాలిబాన్లు వాటిపై దాడి చేయలేదని అధికారులు చెప్పారు.