శ్రద్ధ కేసు : అఫ్తాబ్కు ఐదురోజుల్లో నార్కో టెస్ట్ చేయాలన్న కోర్టు

శ్రద్ధ కేసు : అఫ్తాబ్కు ఐదురోజుల్లో నార్కో టెస్ట్ చేయాలన్న కోర్టు

శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు ఐదురోజుల్లో నార్కో టెస్ట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రోహిణి ఫోరెన్సిక్ ల్యాబ్కు ఆదేశాలు జారీచేసింది. ఇన్వెస్టిగేషన్కు నిందితుడు సహకరించట్లేదని నార్కో టెస్టుకు అనుమతించాలన్న పోలీసుల వాదనకు కోర్టు గురువారం ఒకే చెప్పింది. అదేవిధంగా ఐదురోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. 

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చి.. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు.