హైదరాబాద్, వెలుగు : అగ్రి సొల్యూషన్స్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ) కు చెందిన మహిళలకు 200 డ్రోన్లను పంపిణీ చేసింది. రంగారెడ్డి జిల్లా మాణిక్యమ్మ గూడతోపాటు గుంటూరుతో సహా దేశంలోని 11 ప్రాంతాలలో కేంద్ర రసాయనాలు
ఔషధ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని వెయ్యి డ్రోన్లను అందించారు. వీటిలో కోరమండల్ డ్రోన్లు కూడా ఉన్నాయి. కోరమాండల్ సరఫరా చేసిన డ్రోన్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళా ఎస్హెచ్హెచ్జీ సభ్యులు ఉపయోగిస్తున్నారు.