రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

రైతులను మోసగిస్తే కఠిన చర్యలు
  •     అగ్రికల్చర్​ ఆఫీసర్​ లావణ్య 
  •     నకిలీ మందులు అమ్మిన  ఫెర్టిలైజర్ షాప్ కు నోటీసులు​

కొడంగల్​, వెలుగు : రైతులను మోసగిస్తే సహించేది లేదని అగ్రికల్చర్​ ఆఫీసర్​ లావణ్య హెచ్చరించారు. నాణ్యత లేని మందులు, ఫెర్టిలైజర్, విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. మంగళవారం కొడంగల్​లోని వ్యవసాయ శాఖ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. టౌన్ లోని ఓం ట్రేడింగ్​ఫెర్టిలైజర్ , పెస్టిసైడ్​షాప్​లో కొనుగోలు చేసిన విజయదుర్గా రకం వరి విత్తనాలతో నష్టపోయామని ఇటీవల రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన అగ్రికల్చర్​అధికారులు సుమారు రూ. 1.10 కోట్ల విలువైన జియో లైఫ్​ కంపెనీ బయో మందులు, ఫెర్టిలైజర్ అమ్మకాలు నిలిపి వేయాలని ఓం ట్రేడింగ్ షాప్​ఓనర్ కు నోటీసులు జారీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.