
- అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య
- నకిలీ మందులు అమ్మిన ఫెర్టిలైజర్ షాప్ కు నోటీసులు
కొడంగల్, వెలుగు : రైతులను మోసగిస్తే సహించేది లేదని అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య హెచ్చరించారు. నాణ్యత లేని మందులు, ఫెర్టిలైజర్, విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. మంగళవారం కొడంగల్లోని వ్యవసాయ శాఖ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. టౌన్ లోని ఓం ట్రేడింగ్ఫెర్టిలైజర్ , పెస్టిసైడ్షాప్లో కొనుగోలు చేసిన విజయదుర్గా రకం వరి విత్తనాలతో నష్టపోయామని ఇటీవల రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు.
దీనిపై విచారణ జరిపిన అగ్రికల్చర్అధికారులు సుమారు రూ. 1.10 కోట్ల విలువైన జియో లైఫ్ కంపెనీ బయో మందులు, ఫెర్టిలైజర్ అమ్మకాలు నిలిపి వేయాలని ఓం ట్రేడింగ్ షాప్ఓనర్ కు నోటీసులు జారీ చేశారు. రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.