IPL 2024: 2029 లోనే RCB కి  ఐపీఎల్ ట్రోఫీ.. ఈ ఏడాది విజేత ఎవరంటే..?

IPL 2024: 2029 లోనే RCB కి  ఐపీఎల్ ట్రోఫీ.. ఈ ఏడాది విజేత ఎవరంటే..?

ఒక్క ఐపీఎల్ ట్రోఫీ..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్ లో ఈ జపం పాటిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు టైటిల్ గెలుస్తుందని ఆరాటపడడం.. ఫ్యాన్స్ ను నిరాశ పరచడం మొదటి సీజన్ నుంచి జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి భారీ క్రేజ్ కారణంగా అతనికి అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. టైటిల్ కొట్టకపోయినా ఆ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది గాని ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షలా మిగిలిపోయింది. అయితే   జోస్యం ప్రకారం ఆర్సీబీ జట్టు 2029 లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటుంది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 20 IPL టోర్నమెంట్స్‌లో గెలిచే జట్టులను అంచనా వేసింది. దీని ప్రకారం 2029 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2029 లో టైటిల్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పింది. దీంతో మరో ఐదేళ్లు వరకు ఆర్సీబీ టైటిల్ గెలవదా అని కొందరు అనుకుంటుంటే..కనీసం 2029 లోనైనా గెలుస్తుందిలే అని సంతోషపడుతున్నారు.  AI ప్రెడిక్షన్ ప్రకారం ఈ ఏడాది IPL ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంటుంది. ప్రస్తుతం గుజరాత్ 5మ్యాచ్ లాడి కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. 

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే ప్రస్తుత సీజన్ లో ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన 9 మ్యాచ్ ల్లో 7 గెలవాలి. దీంతో ప్రతి మ్యాచ్ ఈ జట్టుకు కీలకంగా మారింది. ముంబై ఇండియన్స్ తో రేపు (ఏప్రిల్ 11) తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిచిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది.