ఈ ఫలితాలు బీజేపీకి చెంప పెట్టు: సంపత్

ఈ ఫలితాలు బీజేపీకి చెంప పెట్టు: సంపత్

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆలోచన విధానాలకు చెంప పెట్టు అని అన్నారు తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని,  దేశంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయని ఆయన అన్నారు .

బీజేపీ కి ముక్త్ భారత్ అనే విధంగా గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఫలితాలు,ఇప్పుడు జార్ఖండ్ ఫలితాలే  నిదర్శనమని సంపత్ అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన సంపత్.. రాష్ట్రంలో మున్సిపల్ వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందని అన్నారు. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే వార్డుల విభజన జరిగిందని, ఆ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని అన్నారు.