ఈ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలి: ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి

ఈ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలి:  ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఏఐసీసీ సెక్రటరీ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 15.1 శాతం ఉందని, నిరుద్యోగుల పట్ల కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయన్నారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అమలు చేసిన ప్రణాళికలను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న 3,607 మంది ఆత్మలకు శాంతి కలగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిందేనని తేల్చి చెప్పారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రకారం.. ఏడాదిలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 కల్లా ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్‌‌‌‌ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తామని తెలిపారు. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బోరెడ్డి అయోధ్య రెడ్డి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.