బీటెక్ చదువుల్లో కీలక మార్పులివే...

బీటెక్ చదువుల్లో కీలక మార్పులివే...

దేశవ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు ఏఐసీటీఈ మరోసారి అనుమతి ఇచ్చింది. డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ కోర్సులను ఉద్యోగం చేస్తూనే పూర్తి చేసే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ‘ఫ్లెక్సిబుల్ టైమింగ్స్’  అమలు చేసుకోవచ్చని ప్రకటించింది. అంటే ఆఫీస్ వేళల తర్వాత సాయంత్రం పూట లేదా వీకెండ్స్‌‌లో క్లాసులు విని, డిగ్రీలు పొందే చాన్స్ ఇచ్చింది.  ఇప్పటికే కొన్ని చోట్ల దీన్ని అమలు చేస్తున్నా.. ఇకనుంచి ఎక్కువ సపోర్ట్ చేస్తామని  తాజాగా ప్రకటించింది. 

ఇంజినీరింగ్ చదువులను కేవలం క్లాస్ రూమ్స్‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయకుండా.. నేరుగా పరిశ్రమల్లోనే పాఠాలు నేర్చుకునేలా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకున్నది. 2026-–27 అకడమిక్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్స్’ పేరుతో కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నది.  దీని ప్రకారం స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ తమ కోర్సులో 50 శాతం వరకు సిలబస్‌‌‌‌‌‌‌‌ను నేరుగా కంపెనీల్లో పని చేస్తూ నేర్చుకోవచ్చు. కేవలం ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లాగా కాకుండా.. క్రెడిట్స్, పరీక్షలు, సర్టిఫికేషన్ అన్నీ ఇండస్ట్రీ, కాలేజీ కలిసి నిర్వహించనున్నాయి. కొత్తగా తెచ్చిన ఈ విధానం ప్రకారం.. డిప్లొమా విద్యార్థులు ఏడాదిన్నర, బీటెక్/డిగ్రీ విద్యార్థులు ఒక ఏడాదిపాటు పూర్తిగా ఇండస్ట్రీలోనే గడపాల్సి ఉంటుంది. అక్కడ థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. దీనికోసం నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్​ఐఆర్ఎఫ్​)  ఉన్న కాలేజీలు లేదా ఇండస్ట్రీతో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కాలేజీలకే పర్మిషన్ ఇస్తారు. ఇక స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే కంపెనీకి కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ (మూడేండ్ల సగటు) ఉండాలి. అక్కడ స్టూడెంట్లకు క్లాసులు చెప్పేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్, ల్యాబ్స్, మెంటార్స్ ఉండాలి. 

  • మరికొన్ని కీలక మార్పులివే..
  •     విదేశీ విద్యార్థుల కోసం ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో 15 శాతం, పీజీ కోర్సుల్లో 25 శాతం సూపర్ న్యూమరరీ (అదనపు) సీట్లను కేటాయించారు.
  •     ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, కేవలం మహిళల కోసం నడిచే కాలేజీలకు సెక్యూరిటీ డిపాజిట్‌‌‌‌‌‌‌‌లో 50 శాతం రాయితీ కల్పించారు.
  •     కాలేజీల్లో వసతుల తనిఖీకి వెళ్లే ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ విజిట్ కమిటీ’ (ఈవీసీ) ఇకపై ఫిజికల్‌‌‌‌‌‌‌‌గానే కాకుండా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లేదా హైబ్రిడ్ మోడ్‌‌‌‌‌‌‌‌లోనూ తనిఖీలు చేయొచ్చు.
  •     ‘ఉల్లాస్’ స్కీమ్ కింద ప్రతి కాలేజీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కలిసి ఏడాదికి కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని సూచించింది. 
  •     కాలేజీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.