హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్ పురా, రామ్నస్ పురా, దూద్బౌలి, కిషన్ బాగ్, నవాబ్ సాహెబ్ కుంట, శాస్త్రీపురం, రెయిన్ బజార్, లలితబాగ్, బార్కాస్, పత్తర్ గట్టి, పురానాపూల్, రియాసత్ నగర్, అహ్మద్ నగర్, టోలిచౌకి, నానల్ నగర్, చౌవ్నీ, తలాబ్ చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది.