దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి

దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి

 ప్రధాని మోదీ, కేసీఆర్ లపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఉన్న మోదీ రాష్ట్రంలో పదేండ్లు ఉన్న కేడీ తెలంగాణకు ఏం చేయలేదని విమర్శించారు. మోదీ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్ ను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాద్యత తనదని చెప్పారు. 

జంట నగరాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారని వారందరి పని దానం చూస్తాడని చెప్పారు.యువనేత అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీని చేశామని తెలిపారు. 

హైదరాబాద్ కు కృష్ణా జలాలు వచ్చాయంటే అప్పుడు పీజేఆర్ తీసుకున్న నిర్ణయమే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ముందుంచుకుని సెల్ఫీలు దిగుతున్నారు అని విమర్శించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును కాంగ్రెస్ పార్టీ కట్టించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్  పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో బస్తీల్లోని ప్రజలను అడగండని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.