ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్‌లో శనివారం సాయంత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. నలుగురు సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. దాడి తర్వాత, బలగాలు ఉగ్రవాదులను గుర్తించేందుకు చుట్టుపక్కల పెట్రోలింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశాయి. పూంచ్ సెక్టార్‌లోని షా సితార్ ప్రాంతం చుట్టూ భద్రతా దళాలు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఈ ప్రాంతంలో సెర్చ్, కార్డన్ ఆపరేషన్ చేస్తున్నారు.