ఎయిరిండియా ​ఫుడ్​లో మెటల్ ​బ్లేడ్

ఎయిరిండియా ​ఫుడ్​లో మెటల్ ​బ్లేడ్

ముంబై: ఎయిర్​ ఇండియాకు చెందిన విమానంలో ఓ ప్యాసింజర్​కు ఇచ్చిన ఫుడ్​లో మెటల్ ​బ్లేడ్ ​ముక్క కనిపించింది. వారం రోజుల కింద బెంగళూరు నుంచి- శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశాన్ని ఆ ప్రయాణికుడు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేయడంతో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ దర్యాప్తు ప్రారంభించింది.  చివరికి ఆ ఫుడ్​లో బ్లేడ్ లాంటి ఇనుప ముక్క వచ్చింది వాస్తవమేనని సోమవారం ధ్రువీకరించింది. ఆ వస్తువు క్యాటరింగ్ సిబ్బంది ఉపయోగించే కూరగాయల కటింగ్ మెషిన్ నుంచి వచ్చిందని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్​పీరియెన్స్​ఆఫీసర్​ రాజేశ్​ డోగ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తనకు విమానంలో ఇచ్చిన ఫుడ్​ను కొన్ని సెకన్ల పాటు నమిలిన తర్వాత అందులో మెటల్​లాంటి పదార్థం తన నాలుకకు తగిలిందని జర్నలిస్టు, ప్యాసింజర్​ మాథుర్స్​పాల్ ఎక్స్​లో పేర్కొన్నాడు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి హాని జరగలేదని, అదే ఫుడ్ ​చిన్నపిల్లలకు ఇస్తే పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. కాగా,  ఈ ఘటనపై ఎయిర్​ఇం డియా.. ఆ ప్రయాణికుడికి క్షమాపణ చెప్పింది.