ఐశ్వర్యారాయ్‌‌కు కరోనా.. కూతురు ఆరాధ్యకూ సోకిన వైరస్

ఐశ్వర్యారాయ్‌‌కు కరోనా.. కూతురు ఆరాధ్యకూ సోకిన వైరస్

ముంబై: బిగ్‌బీ అమితాబ్‌ ఫ్యామిలీలో ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. శనివారం అమితాబ్‌కు వైరస్ పాజిటివ్‌గా రాగా, ఆ తర్వాత ఆయన తనయుడు అభిషేక్‌కు కరోనా సోకినట్లుగా తేలింది. తాజాగా అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కు, కూతురు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలింది. ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా వచ్చిన విషయాన్ని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే కన్ఫమ్ చేశారు.

బిగ్‌బీ వైఫ్ జయా బచ్చన్‌కు నెగిటివ్‌గా వచ్చినప్పటికీ ఆమెకు మరోమారు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అమితాబ్ ఇంటి పరిసరాలను శానిటైజ్ చేసిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. బిగ్‌బీ ఇంటి పరిసర ప్రదేశాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. ఆ ఇంటికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించరు. ముంబై పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి మోహరించారు. కేవలం అవసరమైన వస్తువులను మాత్రమే బిగ్‌బీ హౌస్‌కి అనుమతించనున్నారు.