ముంబై: ప్రముఖ గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్ను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియా నుంచి కేవలం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. 48.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో యాక్షన్ స్టార్ ఈ లిస్ట్లో 52వ పొజిషన్లో నిలిచాడు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు సంపాదించిన ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.ఫోర్బ్స్ లిస్ట్లో 590 మిలియన్స్ సంపాదనతో 22 ఏళ్ల ఇండర్ప్రెన్యూర్ కైలీ జెన్నెర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది.
ప్రముఖ ర్యాపర్ కాన్యే వెస్ట్ 170 మిలియన్ల ఆదాయంతో ఫోర్బ్స్ లిస్ట్లో మూడో స్థానంలో నిలవగా.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్, ఫేమస్ ఫుట్బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనాల్ మెస్సీ, నెమార్లు టాప్–10లో చోటు దక్కించుకున్నారు. హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ 87.5 మిలియన్ల సంపాదనతో 11వ పొజిషన్లో నిలిచాడు. హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్లో వరల్డ్లో నాలుగో స్థానంలో నిలిచిన అక్షయ్.. రీసెంట్గా పీఎం కేర్స్ ఫండ్కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కరోనాపై అవగాహన కోసం ఓ షార్ట్ఫిల్మ్ను కూడా రూపొందించాడు.