యాదాద్రి, వెలుగు : కాల్వలకు రిపేర్లు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచించారు. ఆలేరు మండలం శారాజీపేట, గొలనుకొండలోని కాల్వలను ఆయన పరిశీలించారు. కాల్వల్లో పలుచోట్ల మొక్కలు, గడ్డి పెరిగి ఉండడంతో పాటు అక్కడక్కడ లైనింగ్ దెబ్బతిని ఉండడాన్ని గమనించారు.
వెంటనే వాటిని రిపేర్లు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు అన్ని విధాలా అండగా నిలబడి వారి సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు. .
