
యాదగిరిగుట్ట, వెలుగు : పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 22 మందితో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు స్థానం కల్పిస్తూ ఏఐసీసీ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో ఐలయ్య మాట్లాడుతూ ఏఐసీసీ తనను పీఏసీ సభ్యుడిగా నియమించడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.
ప్రభుత్వం, పార్టీని సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. మరోవైపు ప్రతిపక్షాల నిరాధారమైన ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.